ఉపోద్ఘాతము:- వర్తమాన దత్తావతారులైన పరమపూజ్య శ్రీశ్రీశ్రీ దత్తస్వామి వారు తెలుగు భాషలో జ్ఞానసరస్వతి అను శీర్షికతో అనేకములైన దివ్యోపన్యాసములను అనుగ్రహించినారు. ఈ శీర్షిక క్రింద ఆ దివ్యోపన్యాసములన్నియును వరుసగా క్రోడీకరించి అందించబడును. సాధన అనగా ఏమి, సాధన ఏ విధంగా...(Click here to read)
[23-01-2003] భగవంతుని నిష్కామముగా ప్రేమించుట లేక ఆరాధించుట అసంభవమని కొందరు తలచుచున్నారు. ఏలయనగా "ప్రయోజన మనుద్దిశ్య న మందోఽపి ప్రవర్తతే" అను సామెత ప్రకారము ఎంతటి మూర్ఖుడైనను ప్రయోజనము లేకుండా ఏ పని చేయడు. మనకు ఏ ఉపకారము చేయకుండా ఒకరి మీద మనకు ప్రేమ ఎలా కలుగుతుంది. ఇచ్చి పుచ్చుకుంటే అపేక్షలు అని అందుకే అంటారు. తండ్రి ధనమును సంపాదించి, మన యొక్క అవసరములు తీర్చుచున్నాడు కావున తండ్రిని ప్రేమించి...
శ్రీ కృష్ణ భగవానుడు ప్రదర్శించిన విశ్వరూపమును అర్థము చేసుకొనుటయే సర్వ వేదముల యొక్కయు సర్వ శాస్త్రముల యొక్కయు సారమై యున్నది. శ్రీ కృష్ణుడు విశ్వరూపమును ప్రదర్శించక ముందు కూడ విశ్వరూపముతోనే యున్నాడు. విశ్వరూపమును ఉపసంహరించిన తర్వాత కూడ విశ్వరూపముతోనే యున్నాడు. అర్జునుని యొక్క దృష్టి మాత్రమే మారినది. సూర్యుడు ఎప్పుడును ప్రకాశించుచునే యున్నాడు. నల్ల కళ్ళజోడు పెట్టగనే ప్రకాశము లేని ఒక బింబమాత్రునిగా గోచరించుచున్నాడు. ఆ కళ్ళజోడు తీయగనే మరల చూచుటకు వీలు కాని మహాప్రకాశముతో మండుచున్నాడు. నీవు నల్ల కళ్ళజోడు పెట్టినపుడు సూర్యుని…
[08.01.2003] బ్రహ్మ జ్ఞానము లేక బ్రహ్మ విద్య అనగా పరమాత్మను గుర్తించుట. "ప్రజ్ఞానం బ్రహ్మ" అని శ్రుతి. అనగా చైతన్యము బ్రహ్మము అని. ప్రజ్ఞాన శబ్దమునకు ‘చైతన్యము’ అను సామాన్య అర్థములో చెప్పినారు. చైతన్యము అనగా సర్వ ప్రాణులయందు సంకల్పాదులను చేయు ఒక విశేషమైన ప్రాణ శక్తి. ఈ చైతన్యమే బ్రహ్మము అని అన్నప్పుడు ఇందులో అర్థము చేసుకొనుటలో ఎట్టి కష్టము లేదు. కొంచెము భౌతిక శాస్త్రము చదివినవాడు శక్తుల యొక్క తత్త్వములను బాగుగా అధ్యయనము చేసినవాడు దీనిని సులభముగా అర్థము చేసుకొనగలడు. ఇదే బ్రహ్మజ్ఞానము లేక బ్రహ్మ విద్య యైనచో...
"మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరమ్, కథయన్తశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ" అని అన్నారు స్వామి భగవద్గీతలో. దీని అర్థము నా యందే మనస్సును ప్రాణములను నిలిపి నా గురించి ఒకరికి ఒకరు చెప్పుకొనుచు ఆ కథలలోని నా కథలను తత్త్వమును లేక అంతరార్థమును బోధించుకొనుచు ఆనందముతో నా భక్తులు నిత్యము రమించు చుందురు అని ఈ శ్లోకార్థము. మనస్సు పరమాత్మ యందు ఎప్పుడు లగ్నమగునో అప్పుడే స్వామికి నీ వాక్కు, దేహము, ప్రాణములు కూడ అర్పించ బడుచున్నవి. ప్రాణము వాయు స్వరూపమై యున్నది...
గురు దత్త నామములో గురు శబ్దము జ్ఞానమునకు, దత్త శబ్దము దానమునకు నిలచియున్నది. జ్ఞానమే వేదము. వేదమే విద్య. విద్య యొక్క ఫలమే వినయము. మరియు జ్ఞానము సత్త్వగుణము వలన పుట్టును. "సత్త్వాత్ సంజాయతే జ్ఞానం" ప్రకారముగా జ్ఞాన కారణమే సత్త్వగుణము. సత్త్వగుణము యొక్క తత్త్వము అహంకారరాహిత్యమే. అనగా వినయమే. కావున గురుదత్త శబ్దము వినయముతో కూడిన దానమును సూచించుచున్నది. రజోగుణముతో కూడిన దానము అహంకారముతో కీర్తి ప్రతిష్ఠల కొరకు స్వార్థముతో కూడి యుండును. కాని గురుదత్తుని తత్త్వము గుప్తదానమై యున్నది. అనగా దానము చేసి తన పేరును బయిటకు రానీయకుండుట. ఇదే సాత్త్విక వినయము. ఈ సృష్టిలో ఏ మంచి కర్మ జరిగినను, ఏ మహిమ జరిగినను...
[దత్త జయంతి సందేశము 07.12.2003] దత్తుడనగా భక్తులకు దర్శన, స్పర్శ, సహవాస, సంభాషణలు అనుగ్రహించుటకు; భక్తుల దుష్కర్మ ఫలములను ఆకర్షించుకొని, అనుభవించి, వారలను కష్ట విముక్తులను చేసి వారి సాధనలను నిర్విఘ్నముగా జరుపుకొనుటకును నరాకారమున అందించబడిన అవతారము. ఏ రాముడో, కృష్ణుడో మాత్రమే దత్తుడు అంటే కుదరదు. ఏలననగా ఒక మనుష్య తరమునకే దత్తుడు పరిమితమైనచో మిగిలిన మనుష్య తరములకు సమానమైన న్యాయము...
“సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ” అని వేదము. స్వామి సత్యమైన అనంతమైన బ్రహ్మము అని చెప్పుచున్నది. స్వామి అంటే గురు దత్తుడే. నీకు ఇష్టమైననూ, కాకున్ననూ దత్తుడు సత్యమునే బోధించును. ఇందుకే ఇంతవరకు దత్తుడు ప్రసిద్ధికి రాలేదు. అయితే ఇప్పుడు ప్రసిద్ధికి వచ్చుచున్నది. కారణమేమనగా ఈ మధ్య ప్రజలు సత్యము యొక్క విలువను గుర్తించుచున్నారు. సత్యము యొక్క ఫలము నిజముగా, శాశ్వతముగా యుండును. సాధారణముగా దేవునితో జనులు వ్యాపార సంబంధమును...
[25-01-2003] సీతాదేవి 18 సంవత్సరముల వయస్సులో రామునితో వనవాసమునకు వెళ్ళెను. పంచవటిలో 3 సంవత్సరములు దండకారణ్యములో పది సంవత్సరములు రామునితో కలసియే ఉన్నది. అప్పటి నుండి ఆమె స్వామి సన్నిధిని కోల్పోయినది. యుద్ధానంతరము అయోధ్యకి వచ్చినను సంవత్సరము తిరగక ముందే మరల స్వామి సన్నిధికి దూరమైనది. చివరకు భూప్రవేశముతో స్వామికి శాశ్వతముగ దూరమైనది. ఇంత భక్తి ప్రేమ కలిగిన సీత స్వామికి ఏల దూరము కావలసివచ్చినది. ఆమె మహా పతివ్రత...
[09-01-2003] సాధన యనగా మంత్రమును జపించుట అని కొందరు, ధ్యానమును చేయుట అని మరి కొందరు, పూజలు చేయుట అని మరి కొందరు తలచుచున్నారు. ఇట్లు పలు విధములుగా తలచుచున్నారు. కాని వీటి వలన భగవంతుడు లభించును గాని, లభించిన భగవంతుడు నిలువజాలడు. ఇవి అన్నియును మనము స్వామిని పిలుచుట. పిలువగనే స్వామి వచ్చుచున్నాడు. కాని మన ఇంటిలోనికి రాగానే దుర్భరమైన కుళ్ళు కంపు కొట్టుచున్నది. దానికి మనము అలవాటు పడినాము. అది లేకుండ మనము...
[18.02.2003] ఈ సృష్టి యొక్క సమయము అను మహా కాల ప్రవాహమునకు పోల్చి చూచినచో మానవ జీవితము ఒక్క నిమిషము మాత్రమే అగును. అనగా 100 సంవత్సరములు బ్రతికిన వాడు ఒక్క నిమిషము బ్రతికిన కీటకముతో సమానము. 50 సంవత్సరముల వయస్సులో పోయినవాడు అర నిమిషము బ్రతికినవాడు. 25 సంవత్సరముల వయస్సులో పోయినవాడు పావు నిమిషము బ్రతికినవాడు. మనము చూచు చుండగనే మన కంటి ఎదుట ఒక కీటకము ఒక నిమిష కాలము బ్రతికినది. మరియొక కీటకము పావు నిమిషమే...